జాతీయ రహదారి డివైడర్ ను ధ్వంసం చేసిన పెట్రోల్ బంక్ యజమాని
వేడుక చూస్తున్న ఆర్ అండ్ బి శాఖ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జనవరి 09 ( ఉదయం )
వ్యాపార లాబ్ధ్ది కొరకు ఏకంగా జాతీయ రహదారి డివైడర్ ను తొలగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన జాతీయ రహదారి రోడ్డు డివైడర్ ను తొలగించడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాహనదారుల ప్రాణాలు పోతే నాకేంది అన్నట్లుగా స్వార్ధ బుద్ధితో లాభాల కొరకు వ్యాపారం మరింతగా పెంచాలని పెట్రోల్ బంక్ యజమాని తన బంక్ కి రాకపోకలకు అనుకూలంగా ఉండేవిధంగా రోడ్డు డివైడర్ ను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై ప్రమాదకరపు ప్రదేశాల్లో రోడ్డు సైడ్ వాహనాలు నిలుపుతే తక్షణమే చర్యలు తీసుకునే అధికారులకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే విధంగా రహదారి రోడ్డు డివైడర్ ను పెట్రోల్ బంక్ యజమాని తొలగించినప్పటికి రహదారులు మరియు భవనాల శాఖ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోడ్డు డివైడర్ తొలగింపు వలన ప్రమాదాలు చోటు చేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్ ను తొలగించిన పెట్రోల్ బంక్ యజమాని పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూద్దాం.

