మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ:- మోదుగు జోగారావు
కొత్తగూడెం() కూలి లైన్,పిబ్రవరి 02:- ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కూలి లైన్ లో యస్.సి.వర్గీకరణ,బి.సి. కులగనణ పై అనుకూల కీలక ప్రకటన చేసిన,ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఫోటోకు పాలభిశేకం చేసిన మాదిగ జే.ఏ.సి.మరియు బి.సి.సంఘం నాయకులు ఈ సందర్బంగా మోదుగు జోగారావు మాట్లాడుతూ యస్.సి.వర్గీకరణ ఈ 2024 కులగనణ ఆధారం గా బి.సి.లతో పాటు,మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రిని,తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గాన్ని కోరినారు.మాదిగలు డా.బి.ఆర్.అంబేద్కర్ వారదసులని,భారత రాజ్యంగాన్ని చెతపట్టుకొని,ఉన్నత చదువులు చదివి,సమానికి ఆదర్శంగా ఉండాలని కోరినారు.మనుధర్మం నుంచి మనకు రక్షణ కవచం భారత రాజ్యాంగ్యం మాత్రమే అని కొనియాడినారు.
ఈ కార్యక్రమంలో మాదిగ జే.ఏ.సి.విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరాల రాజేష్,బి.సి.సంఘం జిల్లా నాయకులు సామంతుల నాగేశ్వరరావు,మహేష్,అభీబ్,కిరణ్,సాయి కుమార్,జే.ఏ.సి.నాయకులు కుమార్,శ్రీను,లహరి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

