ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
కొత్తగూడెం , జూన్ 25 ( ఉదయం న్యూస్ )
చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డ్ పరిధిలో గల చుంచుపల్లి పంచాయతీ లో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. పంటపొలాలు పక్కన ఇంటి జాగ కొనుగోలు చేసి నూతనంగా నిర్మాణం చేపట్టిన రూమ్ లో మృతదేహం వెలుగు చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీస్ అధికారులు క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. ఘటన స్థలంలో పరిశీలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

