అబ్రహం భార్య ఆదిమూలపు శైలజ హఠాన్మరణం.భార్య మరణం అబ్రహం గారికి తీరని లోటు..పరామర్శించిన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్.ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.రోటరీ గవర్నర్ జె.అబ్రహం సతీమణి.ఆదిమూలపు శైలజ (59 సం..లు)సోమవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై గుండెపోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు.అందరితో చలాకీగా ఉండే అబ్రహం భార్య మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. రేపు ఉదయం 6 గంటల వరకు కొత్తగూడెంలోని విద్యానగర్లో ఉన్న అబ్రహం స్వగృహం నందు వారి సతీమణి పార్థివ దేహం మిత్రుల సందర్శనార్థం ఉంచబడుననీ కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆరు గంటల తర్వాత వారి స్వగృహము ఒంగోలు జిల్లా మార్కాపురం బయలుదేరి వెళ్తారని తెలియజేశారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించబడునని కావున కొత్తగూడెం పరిసర ప్రాంత అబ్రహం మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేయడమైనదని అన్నారు. పరామర్శించిన వారిలో ఉదయ్ కుమార్ వెంట సీమకుర్తి రామకృష్ణ గణేష్ రేవంత్ చిన్న తదితరులు పాల్గొన్నారు
next post

