పాల్వంచ , సెప్టెంబర్ 11 ( ఉదయం న్యూస్ )
పాల్వంచ కేటిపిఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల ఫలితాలు గురువారం రాత్రి వెలువడ్డాయి. ఎంతో ఉత్కంఠగా కొనసాగిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో కళాకారుడుగా గుర్తింపు పొందిన సిద్దేల హుస్సేన్ 6 వ స్థానంలో జేయకేతనం ఎగురవేశారు. కేటిపిఎస్ క్రెడిట్ సొసైటీ జనరల్ విభాగంలో ఏడుగురు అభ్యర్థులు గెలిపిందినట్లు అధికారకంగా వెల్లడించారు. మొదటి స్థానంలో బి. మహేందర్ , రెండోవ స్థానంలో ధర్మరాజుల నాగేశ్వరరావు, మూడోవ స్థానంలో డోలి శ్రీనివాస్, నాలుగోవ స్థానంలో దానం నరసింహారావు, ఐదోవ స్థానంలో రఘు కృష్ణ, ఆరోవ స్థానంలో సిద్దెల హుస్సేన్ , ఏడోవ స్థానంలో సిద్ధి ప్రశాంత్ లు గెలుపొందినట్లు అధికారకంగా ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థుల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. కళాకారుడుగా గుర్తింపు పొందిన సిద్దేల గెలుపు పట్ల పలువురు అభినందిస్తున్నారు.

