ఉదయం దినపత్రిక కు అభినందనలు తెలిపిన వాహనదారులు
రోడ్డు మరమ్మతు పనులను చేపట్టిన నవభారత్ ప్లాంట్ యాజమాన్యం
పాల్వంచ , జులై 04 ( ఉదయం న్యూస్ )
చెట్టు కొమ్మతో రోడ్డు ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం అంటూ ఉదయం దినపత్రిక బ్రేకింగ్ కథనంతో స్పందించిన నవభారత్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే మరమ్మతు పనులను చేపట్టారు. పాల్వంచ మండలం నవభారత్ ప్లాంట్ అనుకోని జగ్గుతండా మీదుగా కొత్తగూడెం బైపాస్ రోడ్డుపై ఏర్పడిన గుంత వలన వాహనదారుల ఇబ్బందులను గుర్తించి చెట్టు కొమ్మ అడ్డుగా ప్రమాదాన్ని అడ్డుకుంటున్నారని శుక్రవారం ఉదయం దినపత్రిక కథనం ప్రచురించడంతో నవభారత్ ప్లాంట్ యాజమాన్యం స్పందించారు. వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఉదయం దినపత్రిక కథనం ప్రచురించడం అభినందనీయమని వాహనదారులు కొనియాడారు. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న సందర్భంగా ఉదయం దినపత్రిక యాజమాన్యం కి స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందనలు తెలిపారు.

