U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

బీఆర్ఎస్ లో బారీ చేరికలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి సీఎం కేసిఆర్ చేస్తున్న అభివృధ్ది పనులు,చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై బి. ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు..
పెద్దపల్లి (జిల్లా) పెద్దపల్లి మండలం గౌరెడ్డి సబ్బితం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెద్దులు ఆద్వర్యంలో కాంగ్రెస్ మరియు బిజెపి కి చెందిన 200మంది కార్యకర్తలు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి..అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టని పథకాలు, ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి మన సిఎం కెసిఆర్ చేస్తున్నారని.వాటికి ఆకర్షితులై బి. ఆర్. ఎస్ లో చేరడానికి ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు.గతంలో ఏ ప్రభుత్వ లు కూడా ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టలేదని,ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు..ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలలో కి తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్,సర్పంచ్ చుంచు సదయ్య,బి.అర్. ఎస్ నాయకులు పాల్గొన్నారు…

Related posts

జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ

ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంమరో వ్యక్తికి తీవ్ర గాయాలు

సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

Leave a Comment