ఉదయం/ భద్రాద్రి కొత్తగూడెం.
కొత్తగూడెంలోని పలు మున్సిపల్ వార్డులలో పంచాయతీలలో పద్మశాలి కుటుంబ సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత నమోదు కార్యక్రమాల్లో ఎలక్షన్ కన్వీనర్ పుట్ట శంకరయ్య ఆదేశాల మేరకు అడహక్ కమిటీ సభ్యులందరూ పాల్గొని వందలాదిగా సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా అర్హత కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో పద్మశాలి ఎన్నికలలో పాల్గొనేందుకు తప్పనిసరిగా సభ్యత నమోదు చేయించుకోవాలని నూతన కమిటీ ఎన్నిక కోసం ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.
previous post
next post

