U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుజాతీయ వార్తలుతెలంగాణ

జర్నలిస్టులకు ఆధార్ ప్రత్యేక కౌంటర్..టీయూడబ్ల్యూజే ఐజేయు విజ్ఞప్తి.


హామీ ఇచ్చిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

కలెక్టరేట్ / భద్రాద్రి కొత్తగూడెం.

ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంప్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం నాడు డియుడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆధార్ ఈడీఎం సైదేశ్ కు ఆదేశాలు ఇచ్చారు అదనపు కలెక్టర్. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఈ మెగా క్యాంపు అనంతరం త్వరలోనే ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తేదీలు తెలియజేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటుచేసిన ఈ మెగా ఆధార్ సవరణల కేంద్రంలో ఇబ్బంది పడకుండా జర్నలిస్టులందరి కోసం ఏర్పాటు చేసే తేదీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిష్టాత్మక దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఆధార్ సవరణల మెగా క్యాంప్ జూలై 9 10 వ తేదీలలో జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఉదయ్ కుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏర్పుల సుధాకర్ పాల్గొన్నారు.

Related posts

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెల్లం…!!

భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు

Leave a Comment